నేడు గురజాడ జయంతి

ఈ పేరు వినగానె చటుక్కున గుర్తొచ్చేది “కన్యాశుల్కం”
బాల్య వివాహల పై,వితంతు పునర్వివాహలపై ఆ నాటిక ఒక చంప పెట్టు

ఆద్యంతమూ చమక్కులతో ఆ నాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే నాటిక అది.

ఆ నాటిక తెచిన మార్పు అంతా ఇంతా కాదు
 

“దిద్దుబాటు ” అని మార్పులు తెచ్చినా “చుట్ట తాగని వాడు దున్న పోతై పుట్టు ” అంటు సున్నిత హాస్యం తో కూడిన పద్యం చెప్పినా,”young beautiful,unfortunate widow ” అని బుచ్చమ్మను (ఆ నాటి స్త్రీ) ని పొగిడినా,”కన్యక” పేరు తో కన్నీళ్ళు తెప్పించినా,”యే దేశ మేగినా,ఎందుకాలెడినా” అంటూ దేశ భక్తిని రగిల్చినా గురజాడ వారికే చెల్లు

మన దురదృష్టం మూలానా ఈ రోజు ఆయన మీద ఒక్క వ్యాసామే కనిపించింది

Published in: on సెప్టెంబర్ 21, 2007 at 3:53 ఉద.  6 వ్యాఖ్యలు  

జీ టీ వీ “స రి గ మ ప”….సుస్వరాల హంగామ

నిన్న ఆదివారం తో చిన్న పిల్లల అధ్యాయం ముగిసింది.
ఏంటో ప్రతి గురు,శుక్ర వారాలు ఈ కార్యక్రం కోసం ఎదురు చూడడం అలవాటు అయ్యింది.
ఒక్క సారిగా ఇంత అభిమానాన్ని చూరగొన్న  ఈ కూనలు  మళ్ళీ పాడరు అన్న విషయం జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టేలా ఉంది..అద్రుష్టవశాత్తు బాలు గారి “పాడలని ఉంది” వెనువెంటనే చిన్న పిల్లల అధ్యాయం మొదలు పెట్టడం  ఈ రత్నాలకు మర్రిన్ని మెరుగులు దిద్దడమే !

కారుణ్య పర్యవేక్షణనుంచీ బాలుగారీ పర్యవేషణకు మారడం ఈ పిల్లల పూర్వ జన్మ సుకృతమే!
 
ఈ కార్యక్రమం మొదలైన దగ్గరినుంచీ ప్రతి ఆధ్యాయం చూస్తున్నా.వాళ్ళను కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో అని ప్రతి సారీ అనుకున్నా.

బడిలో ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న వీరు అంత పెద్ద పాటలని మర్చిపోకుండా అంత మంది ముందు పాడడం చూసి  ఆశ్చర్యం వేసింది.

 ఈ సారి ముందు నిలచిన సాయి దేవ హర్ష పాటవింటే అందరికీ ఇదే అనిపిస్తుంది.8 ఏళ్ళ చిన్ని బాబు,ఎక్కడా శృతి తప్పకుండా,పెద్ద పెద్ద సమాసాలను,పద్యాలను చేతిని తిప్పుతూ పాడాడు.

రెండో స్థానం లో నిలచిన “భువన కృతి”,ఆ తరువాతి స్థానాలలో ఉన్న”శరత్ సంతోష్” “అనిరుధ్”,”సత్య యామిని” మొదలైన వారు ఎదో చిన్న తప్పులు చేసి వెళ్ళారు తప్ప,అంతా మొదటి స్థానానికి పూర్తి అర్హత గల వారే.

ముఖ్యం గా నాకు అందరి కన్నా “అనిరుధ్” తెగ నచ్చేశాడు.
సాధారణం గా పోటీ సంగీత కార్యక్రమాలలో ఎవరూ పాడని “జయభేరి” చిత్రం లోని “రసి క రాజ తగువారము కాదా..ఏలు దొరవు అరమరికలు లేక..” అన్న పాట ఈ  అబ్బాయి పాడిన తీరు నన్ను ఈ అబ్బాయి అభిమానిగా మార్చేసింది.
ఈ పాట సంగీతం తో నిష్ణాతులకు తప్ప అన్యులకు కొరగాదు.అలాంటి పాటను ఈ అబ్బాయి  ఒక్క గమకం కూడా వదలకుండా,ఎక్కడా పక్కకు పోకుండా పాడడం నిజంగా చాలా  చాలా great

చాలా రోజులు నుంచీ నేను మన పాత పాటలు నేటి తరానికి అందవేమో అనుకున్నాను.ఈ కార్యక్రమం చూసాక ఆ భయం పోయింది.ఎన్నో మరుగున దాగిన ఆణిముత్యాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇంకా ఆనందించదగ్గ విషయం ఏంటి అంటే…దీనిని నడిపిస్తున్న “కారుణ్య” చక్కగా తెలుగులో మాట్లాడడం.కార్యక్రమం మొదట్లో “కారుణ్య”వాడిన  తెలుగు సొబగులు,కార్యక్రమం మీద ఆశక్తి రేపింది.న్యాయనిర్ణేతలుగా వచ్చిన ‘కోటి”,”శైలజ”,రమణ గోగుల” తమ పాత్రలని చక్కగా నిర్వహించారు.

పంటికింద రాయిలా ఈ కార్యక్రమం ఆఖరి భాగం గా అనిపించింది.అంత హంగామా,మధ్యలో దేవి శ్రీ ప్రసాద్ పిచ్చి గెంతుళ్ళు ఎబ్బేట్టు గా అనిపించింది.
లేత మనసులకి అంత బహుమతులు ఇవ్వడం వల్ల దాని ప్రభావం తీవ్రం గా ఉంటుందేమో.మొదటి ముగ్గురికీ 50వేలకు పైగా ఇస్తూ,అంతే స్థాయి లో పాడిన మొదటి 5 వారికి ఏమీ ఇవ్వక పోవడం కాస్తంత బాధ గా అనిపించింది.

దీన్లో మొదటి 10 మందికి స్తేజి మీద,అందరి ముందూ ఇస్తే ఎంతో ప్రోత్సాహకరం గా ఉండేది.

అంత హంగామా మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపేబదులు simple గా చేసి ఉంటే బాగుండేదేమో.కార్యక్రమం ఆద్యంతమూ sponsors  వల్ల నడుస్తుండడం వల్ల అడ్డు చెప్పలేం.

SMS పద్దతి కాకుండా నిష్ణాతులైన వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించి ఉంటే బాగుండేదేమో.

వ్యక్తిగతం గా నేను సాయి దేవ హర్షకు మొదటి స్థానం రావడం అంగీకరించను

ఆ అబ్బాయి అంత చిన్న వయసులో కలిగిన గ్రహణ శక్తి నిర్వివాదశం

తను పాడిన పాటల్లో శాస్త్రీయ సంగీతం పాలు తక్కువ
 
శాస్త్రీయ సంగీతం లో మంచి పట్టు కలిగింది తరువాతి స్థానం లో ఉన్న శరత్,అనిరుధ్,భువన.

అనిరుధ్ ముఖం లో భయం ప్రస్పుటం గా ప్రతి సారీ కనిపించింది
అది తగ్గించుకుంటే భవిష్యత్తులో మంచి గాయకుడు అవ్వగలడు  

గెలుపూ ఓటములు పక్క పెడితే ప్రతి ఒక్కరి గళం ఈ పోటీ వల్ల చాలా మెరుగులు దిద్దింది అన్నది మాత్రం నిజం

ఇలాంటి కార్యక్రామల కోసం  అయినా నేటి తరం శాస్త్రీయ సంగీతం వైపు దృష్టి సారిస్తుందేమో!

ప్రతి భాగం లో పిల్లల కల్మషం లేని మనసు ప్రస్పుటం గా కనిపించింది.తమ మధ్య ఇంత వరకు పాడిన స్నేహితుడు వెళ్ళి పోవడం చూసి ఆ పసి మనసులు కన్నీళ్ళు పెట్టుకోడం చూసి నా కన్నీళ్ళూ ఆగలేదు. అందుకే కదా పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు.మనం పెరిగే కొద్దీ ఆ కల్మషమే హరించుకుపోయి “పక్క వాడికంటే ముందు ఉండాలి” అన్న ఆలోచనతో మొదలయ్యి ఈర్ష్య ,ద్వేషం గా కొనసాగి “ఆఖరికి పక్కవాడిని ముంచే” స్థాయికి చేరుతుందేమో!!

  

Published in: on సెప్టెంబర్ 11, 2007 at 4:04 సా.  4 వ్యాఖ్యలు  

ఎటు పోతున్నాం మనం?

 చదివాక ఈ కిందదీ ఎంతో సముచితం అని భావించి టపా రాస్తున్నా

మా వీధి లో జరిగిన ఒక యధార్ధ సంఘటన మీ ముందు ఉంచుతున్నా

“మేము ఉంటున్నది రైల్వే కాలనీ.ఇళ్ళన్నీ పక్క పక్కనే.గోడలు ఇళ్ళకు మాత్రమే,మా మనసులకి కాదు.

రామారావు గారు,వారి భార్యకవిత ,3 పిల్లలు.కవిత గారిది చక్కటి రూపం.
వాళ్ళ ఎదురింటిలో వెంకటయ్య గారు.రిటైరు అయ్యారు.4 అబ్బాయిలు
రామా రావు గారు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళడం తో,వెంకటయ్య గారింట్లోనే కవిత కు కాలక్షేపం
 
ఈ క్రమం లో వెంకటయ్య గారి ఆఖరి అబ్బాయి కళ్యాణ్ తో సీతకి స్నేహం ఏర్పడింది. కవిత పిల్లలు కళ్యాణ్ ని “మావయ్య” అని పిలిచే వారు.
రామారావు పని వత్తిడి వలన ఎక్కడికైనా తీసుకువెళ్ళక పోతే కళ్యాణ్ , కవిత ను తీసుకెళ్ళే వాడు 
క్రమం గా వీళ్ళ స్నేహం పెరిగింది.అది ఎంత వరకు వచ్చింది అంటే,రామరావు,కవిత సంసార విషయాలను సైతం ఈ కళ్యాణ్ తో చర్చిండం వరకు.

ఈ స్నేహన్ని ఆ వీధిలో ఒక్కొక్కరూ ఒక్కో పేరుతో పిలిచే వారు. 

లోకుల మాటలు ఎందుకు నిజం చెయ్యకూడదు అన్న ఆలొచన కవిత కు కలిగింది.అదే సమయం లో మా ఊరిలో చిరు ఉద్యోగం చేస్తున్నా కళ్యాణ్ కు తిరుపతి లో రావడం తో అక్కడికి కవిత , కళ్యాణ్ చేరుకున్నారు.”

రామారావు ఆ ఊళ్ళో ఉండలేక వేరే ఊరు బదిలీ అయ్యారు.ప్రస్తుతం కవిత 3 పిల్లలు  కవిత తండ్రి దగ్గర
పెరుగుతున్నారు.
 
దిగజారుతున్న విలువలకు సజీవ దృశ్యం ఈ సంఘటన.
ఎవరి దారి వారు చూసుకున్నారు.మధ్యలో బలి అయ్యింది పసి పిల్లలు
పెళ్ళై,చక్కగా సంసారం,చక్కని పిల్లలూ ఉండి కూడా తాత్కాలిక ఆకర్షణను,కా(లో)కుల మాటలకు ఊతం ఇచ్చింది కవిత . 
పెళ్ళి కాక ముందు ఏది చేసినా అది పూర్తిగా వ్యక్తిగతం.పెళ్ళయ్యాక చేస్తే అది ఆ ఇద్దరికీ సంబంధించినది.పిల్లలు కలిగాక చేస్తే అది ఒక సంపూర్ణ కుటుంబానికి చెందినది
కవిత దృష్యా తను చేసింది ఒప్పే కావచ్చు.

కానీ మధ్యలో తమ భవిష్యత్తును పణం గా పెట్టింది అభం శుభం తెలియని పిల్లలు

తమ మధ్య స్వచ్చమైన స్నేహాన్ని పది మందీ తప్పుగా అనుకొని ఉండచ్చు.అయినంత మాత్రాన అది నిజం ఎందుకు చెయ్యాకూడదు అనుకోవడం,అదే నిజం చేసి అందరి ఊహలను నిజం చెయ్యడం తప్పు
 

Published in: on సెప్టెంబర్ 4, 2007 at 11:28 ఉద.  2 వ్యాఖ్యలు