నేడు గురజాడ జయంతి

ఈ పేరు వినగానె చటుక్కున గుర్తొచ్చేది “కన్యాశుల్కం”
బాల్య వివాహల పై,వితంతు పునర్వివాహలపై ఆ నాటిక ఒక చంప పెట్టు

ఆద్యంతమూ చమక్కులతో ఆ నాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే నాటిక అది.

ఆ నాటిక తెచిన మార్పు అంతా ఇంతా కాదు
 

“దిద్దుబాటు ” అని మార్పులు తెచ్చినా “చుట్ట తాగని వాడు దున్న పోతై పుట్టు ” అంటు సున్నిత హాస్యం తో కూడిన పద్యం చెప్పినా,”young beautiful,unfortunate widow ” అని బుచ్చమ్మను (ఆ నాటి స్త్రీ) ని పొగిడినా,”కన్యక” పేరు తో కన్నీళ్ళు తెప్పించినా,”యే దేశ మేగినా,ఎందుకాలెడినా” అంటూ దేశ భక్తిని రగిల్చినా గురజాడ వారికే చెల్లు

మన దురదృష్టం మూలానా ఈ రోజు ఆయన మీద ఒక్క వ్యాసామే కనిపించింది

ప్రచురితం:  on సెప్టెంబరు 21, 2007 at 3:53 పూర్వాహ్నం వ్యాఖ్యలు (6)

ఈ టపాని ట్రాకుబ్యాకు చెయ్యడానికి URI: http://vaagdevi.wordpress.com/2007/09/21/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be%e0%b0%a1-%e0%b0%9c%e0%b0%af%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf/trackback/

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్

అభిప్రాయములు Leave a comment.

  1. నిజమేనండి… ఆధునిక తెలుగు సాహిత్యంలో చాలా వాటికి ఆయనే ప్రధముడు. ఆయన జయంతిని గుర్తు చేసినందుకు థాంక్స్ అండి..

  2. IT is good that people like you are still keeping up the flame. Gurajada vanti goppa rachayitanu gurtu chesukune samayam mana patrikalau TV laku lekapovtam chala ghoram.

  3. ఈ నాటి తెలుగు ప్రజలు గురజాడ గారిని దాదాపు (ప్రభుత్వం తో సహా) మరచిపోయారు.

    బ్లాగర్లు మాత్రం ఈ జాబితాలో లేరండోయ్…..

    గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు.

    మీ వేణు
    viseshaalu.blogspot.com

  4. ఇటీవలే కన్యాశుల్కం చదివా..
    అలాంటి సంభాషణలతో, అటువంటి కథతో ఈనాడు సినామాలు ఎందుకు రావు అని చాలా బాధవేసింది.

  5. కన్యాశుల్కాన్ని దయ చేసి నేటి సినిమల్లో ఊహించుకోడం అత్యాశకు 1000 రెట్లు
    ఇప్పుడు అలాంటి సంభాషణలు రాక పోవడానికి కారణం భాష మీద పట్టు లేక పోవడం
    ఏదో నాలుగు పుస్తకాలు చదివేసి,అదే తెలుగు సాహిత్యం అనుకుని,ఎక్కడ”target audience ని reach “అవ్వవ్వో అని ఏది పడితే అది సినిమాల్లో వాడడం

  6. గురజాడ వేంకట అప్పారావు గారి దేశ భక్తి గీతం -”దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా……. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్…..”.

    మీరు ప్రస్తావించిన “ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ……” రాసినది రాయప్రోలు సుబ్బారావు గారు. గమనించగలరు.


Leave a Comment